రాజధాని తరలించ వద్దని ఉత్తుత్తి ఉద్యమాలు నడిపిస్తావు!
పులివెందుల ఫోబియా ఒకటుందని (who) తక్షణం నోటిఫై చేయాలి
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సిపి పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. పులివెందుల ఫోబియా ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ( who ) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు! అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ? ఒక వైపు అమరావతి నుంచి రాజధాని తరలించ వద్దని ఉత్తుత్తి ఉద్యమాలు నడిపిస్తావు. మళ్లీ ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తావు. వారి ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటే ఇలాంటి శాస్తే జరుగుతుంది అంటూ జయసాయి రెడ్డి మండిపడ్డారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/