రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతుంది

సిఎం జగన్‌ క్క చేష్టలతో రాష్ట్రం పరువుపోతోంది

Chandrababu Naidu
Chandrababu Naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందని, మీడియా స్వేచ్ఛను హరించే నియంతృత్వ వైఖరులను తాము ఖండిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. మీడియాపై నిర్భయ కేసులు బనాయించడం ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. తరగతి గదుల్లో పోలీసులు దుస్తులు ఆరేసిన ఘటనను ఫొటోలు తీసినందుకు విలేకరులపై కేసులు నమోదు చేయడాన్ని ఏమని భావించాలని ప్రశ్నించారు. తునిలో విలేకరి హత్య జరిగిందని, చీరాలలోనూ ఓ మీడియా ప్రతినిధిని చంపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఓ పత్రిక ఎడిటర్ పై దాష్టీకం చెలాయించారని తెలిపారు. అధికారం చేపట్టిన తర్వాత సీఎం జగన్ నిరంకుశ విధానాలు, తిక్క చేష్టలతో రాష్ట్రం పరువు పోతోందని చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి నియంతలకు కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు.


తాజా జాతీయ వార్తల కసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/