మార్చి నెలలో రూ.1,60,122 కోట్ల వసూళ్లు – కేంద్రం ప్రకటన

మార్చి నెలకు సంబదించిన GST వసూళ్లను కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మార్చి నెలలో జీఎస్టీ (GST) వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. మార్చిలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వసూళ్లు అంతకు ముందు సంవత్సరం కన్నా 13% పెరిగి రూ. 1,60,122 కోట్లకు చేరుకుంది. జూలై 2017లో GST అమలులోకి వచ్చిన తర్వాత ఇది రెండో అత్యధిక వసూళ్లు నమోదు చేసింది.

ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.29,546 కోట్లు కాగా… రాష్ట్రాల జీఎస్టీ రూ.37,314 కోట్లు అని వివరించింది. ఐజీఎస్టీ కింద రూ.82,907 కోట్లు వసూలైంది. ఐజీఎస్టీ వసూళ్ల పరంగా ఇది ఆల్ టైమ్ రికార్డు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఐజీఎస్టీ వసూలు కాలేదు. ఇక, మార్చి నెలలో సెస్ ల రూపంలో రూ.10,355 కోట్లు వసూలైనట్టు కేంద్రం తెలిపింది.