రూ.2,290 కోట్ల విలువైన ఆయుధాలు కొనేందుకు కేంద్రం ఆమోదం

అధునాతన ఆయుధాలు కొనాలని నిర్ణయం

india army

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే అధునాతన ఆయుధాలు, సైనిక పరికరాలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం పలికింది. మొత్తం రూ,. 2,290 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో భాగంగా యూఎస్ నుంచి 72 వేల సిగ్ సవూర్ అసాల్ట్ రైఫిల్స్, ఇతర పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను డీఏసీ (డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్) ఆమోదించగా, ఆ వెంటనే రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయాధికార కమిటీ,సైనికులకు మరిన్ని ఆయుధాలు అందించేందుకు అంగీకరించింది. ఈ నిధులతో రైఫిల్స్ తో పాటు వాయు, నౌకాదళాలకు స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్స్ సిస్టమ్ లను కూడా కొనుగోలు చేయనున్నారు. వీటి ధర రూ. 970 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది.

కాగా, ఎటువంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలన్న ఆలోచనతో భారత సైన్యం భారీ ఎత్తున ఆయుధాలను సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా లైట్ మెషీన్ గన్స్, బ్యాటిల్ కార్బైన్స్ తదితరాలను కొనుగోలు చేస్తోంది. ప్రపంచంలో అత్యధిక సైన్యం కలిగున్న టాప్2 దేశంగా ఉన్న భారత సైన్యం.. తన అవసరాల నిమిత్తం 7 లక్షల రైఫిల్స్, 44 వేల లైట్ మెషీన్ గన్స్, 44,600 కార్బైన్స్ సమకూర్చుకునే పనిలో పడింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/