సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ

అమరావతి : సీఎం జ‌గ‌న్ తో కేంద్ర బృందం భేటీ అయింది. నాలుగు జిల్లాల్లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం ప‌ర్య‌టించింది. తుఫాన్ తో జ‌రిగిన న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌టానికి కేంద్ర బృందం వ‌చ్చింది. కాగా త‌క్ష‌ణ‌మే రూ.1000 కోట్ల ఆర్థిక స‌హాయం చేయాల‌ని సీఎం జ‌గ‌న్ కేంద్రాన్ని కోరారు. కాసేప‌ట్లో చిత్తూరు,క‌డ‌ప‌, నెల్లూరు, అనంత‌పురం జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో సీఎం జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. వ‌ర‌ద‌లు, న‌ష్టాల‌పై ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/