భారత్లో కరోనా..అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ
విమానాశ్రయాల్లో కరోనా స్క్రీనింగ్ కేంద్రాల ఏర్పాటు తప్పనిసరి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కొవిడ్-19) అనుమతి కేసులు భారత్లో పెరుగుతుండడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఈసందర్భంగా విమానాశ్రయాల్లో కరోనా స్క్రీనింగ్ కేంద్రాల ఏర్పాటు తప్పనిసరి చేయాలని సూచించింది. చైనా, సింగపూర్, మలేషియా, ఇండొనేషియాతో పాటు పలు దేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ప్రయాణికుల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించింది. కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/