ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ..కేంద్రం కీలక నిర్ణయం

విదేశాల నుంచి ఏసీల దిగుమతిపై నిషేధం

air-conditioners

న్యూఢిల్లీ: ప్రధాని మోడి పిలుపు మేరకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఏసీల దిగుమతిపై నిషేధం ప్రకటించింది. దేశంలో ఏసీ యంత్రాల తయారీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ దాదాపు 30 శాతం ఏసీలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని, సాధ్యమైనంత తక్కువ సమయంలో ఈ దిగుమతిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని ఆ ప్రకటనలో కోరారు. అత్యవసరమైనవి తప్ప ఇతర వస్తువుల దిగుమతులను భారత్ క్రమంగా తగ్గిస్తోంది. స్వావలంబన సాధించడం, దేశీయ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం మోదీ సర్కారు ముఖ్య లక్ష్యం. ఈ క్రమంలో ఆత్మ నిర్భర్ అభియాన్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా పలు రకాల కలర్ టీవీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఇప్పటికే నిషేధం విధించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/