సెప్టెంబర్ 6 న జగన్‌ సర్కార్‌ తో కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం

కేంద్రం ప్రభుత్వం సెప్టెంబర్ 6 న జగన్ సర్కార్ తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ కీలక అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించ నున్నారు కేంద్ర సమన్వయ కార్యదర్శి .

పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, కృష్ణ-గోదావరి రివర్ బోర్డులు గెజిట్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, పెట్రోలియం యూనివర్శిటీ, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడలో హార్డ్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి అంశాల పై కేంద్రం కీలక సమీక్ష నిర్వహించనుంది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ – ప్రమాణాల పెంపు, ఎన్ఎస్టీఎల్ కు సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర సమన్వయ కార్యదర్శి మాట్లాడనున్నారు.