నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
న్యూఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటి జరుగునుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన అజెండా మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ నెల 4న సమావేశమై ఆరోగ్యం, వైద్య రంగంలో సహకారంపై భారత్, ఇజ్రాయెల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) రంగంలో సహకారంపై భారత కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ డిజిటల్, కల్చర్, మీడియా అండ్ స్పోర్ట్స్ (డీసీఎంఎస్) మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/