నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
న్యూఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం ఉదయం జరిగింది. రూ .15 వేల కోట్లతో పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎహెచ్ఐడీఎఫ్) ఏర్పాటుకు జూన్ 24న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం తరువాత ఇంధన, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇండియన్ నేషనల్ స్పేస్, ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనే కొత్త సంస్థ ఏర్పడినట్లు తెలిపారు. ఇది స్నేహపూర్వక వాతావరణంలో విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రైవేట్ పరిశ్రమలకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/