ఎవరుపడితే వారు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేందుకు నో ఛాన్స్ !
కొత్తగా ఆన్లైన్ ఛానల్స్ ఓపెన్కు కేంద్రం అనుమతి తప్పనిసరి

New Delhi: ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, కంటెంట్ అందించే సంస్థలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
వీటిని సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసువస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్పై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు.
ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
ఇక ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్పై ప్రభుత్వ కన్ను
సమాచార ప్రసార శాఖ నియంత్రణలోకి డిజిటల్ కంటెంట్
జాబితాలో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ తదితరాలు
ఓటీటీలో పెరిగిపోతున్న అశ్లీలత కట్టడికి కేంద్రం నిర్ణయం
దీంతో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ తదితర పలు సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి చేరినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇప్పటివరకూ డిజిటల్ కంటెంట్ను నియంత్రించేందుకు ఎలాంటి చట్టాలు లేదా స్వతంత్ర ప్రతిపత్తిగల అధికారిక సంస్థ ఏర్పాటుకాని నేపథ్యంలో తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రెస్ కౌన్సిల్ :
ప్రస్తుతం ప్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ , ఇదేవిధంగా న్యూస్ ప్రసార చానళ్లను న్యూస్ బ్రాడ్ క్యాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ) మానిటర్ చేస్తోంది.
సినిమాల విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)కి అధికారాలుండగా.. ప్రకటనలకు సంబంధించి అడ్వర్టయిజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రణ బాధ్యతలు చూస్తోంది.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/