ఏపీకి కేంద్రం తీపి కబురు..867 కోట్లు విడుదల

ఏపీ సర్కార్ కేంద్రం వరుస తీపి కబుర్లు అందిస్తూనే ఉంది. ఇప్పటికే అనేక వాటికీ సంబదించిన నిధులను విడుదల చేసిన కేంద్రం…తాజాగా పాఠశాల భవనాల మర మత్తులు మరియు ఇతర మౌలిక వసతుల కల్పనకు సమగ్ర శిక్ష అభియాన్ కింద 867 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి ఏకంగా 867 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.

వీటిలో 823 కోట్లు ఖర్చు చేశారని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి వివరించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. దేశంలో లక్ష ఇరవై వేల ఐసీటీ ల్యాబ్లు, 82 వేల స్మార్ట్ తరగతి గదులు అలాగే ఉపాధ్యాయులకు 14 లక్షల ట్యాబ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధికి మరింత నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.