కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు

కేసీఆర్ సర్కార్ కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను నవంబర్ 30లోపు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. గత కొద్దీ నెలలుగా కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య అగ్గి రాసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా కేంద్రం లో బిజెపిని గద్దె దించాలని కేసీఆర్ చూస్తున్నాడు. అందుకే BRS అనే పార్టీ ని స్థాపించారు. అయితే, ఈ తరుణంలో.. కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం బిగ్‌ షాక్‌ ఇచ్చింది.

ఉపాధి హామీ పథకంలో రూ.152 కోట్ల అవకతవకలు జరిగాయని, కేసీఆర్‌ సర్కార్‌ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. మరో 2 రోజుల్లోనే దీనిపై కేసీఆర్‌ ప్రభుత్వానికి స్పందించాలని నోటీసుల్లో పేర్కొంది కేంద్రం.లేదంటే తదుపరి వాయిదాలను నిలిపివేసే అవకాశం ఉంది. గత జూన్లో కేంద్ర బృందాలు తెలంగాణను సందర్శించి.. ఉపాధి హామీ పథకం నిధులను అనుమతి లేని పథకాలకు మళ్లించినట్లు గుర్తించాయి. ఉపాధి హామీ పథకం అమలులో పనుల కేటాయింపులలో పలు అవకతవకలు జరిగాయని నిర్ధారించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరి ఈ నోటీసుల ఫై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.