సంబరాలు చేసుకుంటున్న ఆప్ కార్యకర్తలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. కాగా ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం వచ్చిన నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలనుద్దేశించి ఒక ప్రకటన వెలువరించారు. సంబరాలు చేసుకునే సమయంలో బాణాసంచా కాల్చవద్దని ఆయన వారిని కోరారు. ఢిల్లిలో కాలుష్యాన్ని నివారించడం కోసం బాణాసంచా కాల్చవద్దని ఆయన కోరారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/