మునుగోడు ఎన్నికలో గుర్తు మార్పు..రిటర్నింగ్ అధికారిపై సీఈసీ ఆగ్రహం

సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశం

Campaigning of major parties in Munugoda from today

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో గుర్తులకు సంబంధించి మరో వివాదం చోటుచేసుకుంది. తమ గుర్తు కారును పోలిన విధంగా మరి కొన్ని గుర్తులు ఉన్నాయని… వాటిని తొలగించాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది.

తాజాగా రోడ్ రోలర్ గుర్తు విషయంలో వివాదం నెలకొంది. యుగ తులసీ పార్టీ అభ్యర్థి శివకుమార్ కు రోడ్ రోలర్ గుర్తును కేటాయించారు. అయితే, తాజాగా ఈ గుర్తును మార్చి వేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రోడ్ రోలర్ గుర్తును ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.