జీవీకే,ఆయన కుమారుడిపై సీబీఐ కేసు

జీవీకే గ్రూప్ అవినీతికి పాల్పడినట్టు..సీబీఐ కేసు నమోదు

CBI Registers Case Against GVK Group Chairman, Son For Corruption

ముంబయి: మంబయి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కాంట్రాక్ట్ ఒప్పందంలో నిదుల దుర్వినియోగానికి సంబంధించి జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదైంది. జీవీకే గ్రూప్ ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేసేందుకు మియాల్ రిజర్వు ఫండ్ రూ.705 కోట్లను దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపించింది. జీవీకే గ్రూప్ ఛైర్మన్ అయిన వెంకట కృష్ణారెడ్డి గునుపాటి, అతని కుమారుడు మంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జీవీ సంజయ్ రెడ్డిలతోపాటు మియాల్, జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, మరో 9 ప్రైవేటు కంపెనీలు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. విమానాశ్రయం అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. మంబయి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/