విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్లేందుకు సీబీఐ గ్రీన్ సిగ్నల్..

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి గుడ్ న్యూస్ అందించింది సీబీఐ కోర్టు. విదేశాలకు వెళ్లేందుకు విజయసాయికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరగా.. కోర్ట్ ఓకే చెప్పింది. కోర్టు రూ.5లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని విజయసాయిరెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. అక్టోబరులోగా రెండు వారాలు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. కాగా.. దుబాయ్, బాలి, మాల్దీవులకు వెళ్లేందుకు విజయసాయి అనుమతి కోరారు. తీర ప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు వెళ్తున్నట్లు కోర్టుకు విజయసాయి తెలియజేశారు.

కోర్టు ఆదేశాలకు ముందు ట్విట్టర్ వేదికగా విజయసాయి ఆసక్తికర ట్వీట్ చేసారు.‘లిటిగేషన్‌కు వెళ్లాలంటే ఏ స్థాయి లాయర్లను పెట్టుకోవాలి..? ఎంత ఫీజుకు సిద్ధపడాలి..? అని కక్షిదారులు ఆలోచిస్తారు. గంటకు కోటి తీసుకునే ప్లీడర్‌ను నియమించుకోవడం ఒక ఎత్తయితే కోవర్టుకు కక్షిదారు వేషం వేసి లక్షల యూరోలు చెల్లించడం నయా శకుని చంద్రానికే చెల్లింది’ అని ట్వీట్ చేశారు.