చంద్రబాబును అడ్డుకున్నవారిపై కేసులు

Chandra babu
Chandra babu Vizag Tour (File)

Visakhapatnam: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం విశాఖపట్నం పర్యటనలో అడ్డుకున్న ఘటనలో నిందితులపై కేసులు నమోదయ్యాయి.

చంద్రబాబు వాహనశ్రేణిపై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. 

విశాఖలో చంద్రబాబు యాత్రను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జేటీ రామారావుపైనా, వైసీపీ నాయకురాలు ఎన్. కృపాజ్యోతిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. జేటీ రామారావు, కృపాజ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/