భూవివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డిపై కేసు నమోదు
డబ్బులు డిమాండ్ చేశారంటూ కోర్టును ఆశ్రయించిన ఫిర్యాది
Hyderabad: తాజాగా మరో భూవివాదంకు సంబంధించి ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డిపై ఆరోపణలొచ్చాయి. ఎమ్మెల్యే తమ దగ్గర డబ్బులు డిమాండ్ చేశారంటూ మేకల శ్రీనివాస్ యాదవ్ కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో కోర్టు ఆదేశాలతో సుభాష్ రెడ్డిపై జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతమ్కుమార్పై కూడా కేసు నమోదైంది. ఈ సంఘటన ప్రస్తుతం చర్చగా మారింది .
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/