కమల్ హాసన్‌కు మదురై కోర్టులో ఊరట

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కేసు కొట్టివేత

Kamal Haasan

Chennai: సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌కు మదురై కోర్టులో ఊరట లభించింది. మ‌హాభార‌తం గురించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కేసును కొట్టి వేస్తున్నట్లు కోర్టు చెప్పింది. 2017లో ఒక టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో కమల్ హాసన్‌ మహాభారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో దుమారం రేగింది. కమల్ వివాదాస్పద వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్‌లై జిల్లా పళైయూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి వల్లియూర్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆ పిటిషన్‌ను కొట్టి వేయాల్సిందిగా నటుడు కమల్ హాసన్‌ మదురై హైకోర్టును ఆశ్రయించారు.

తాగాగా మరోసారి ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో నటుడు కమల్ హాసన్‌ తరఫు న్యాయవాది హాజరై ఇలాంటి వివాదాస్పద సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మాటలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కమల్ హాసన్‌పై కేసును కొట్టి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/