రాజధాని రైతుల బస్సు యాత్ర

అమరావతి పరిరక్షణ జేఏసి నిర్ణయం

BUS
BUS

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ.. రాష్ట్రంలోని 13 జిల్లాలలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు, ఈ యాత్ర ఈ రోజే ప్రారంభంకానున్నట్లు జేఏసి తెలిపింది. ఆందోళన బాట పట్టిన అమరావతి పరిరక్షణ జేఏసీ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హైకోర్టు నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొంది. బస్సు యాత్రలో భాగంగా విశాఖపట్టణం, కర్నూలు జిల్లాల్లో కూడా రైతులు పర్యటించనుండటంతో అక్కడి ప్రజల స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు పలు రాజకీయ పార్టీలతో కలిసి సంయుక్త కార్యాచరణ సమితి(జేఏసి)గా ఏర్పడి నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు 21వ రోజుకు చేరాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/