ఏపీలో ఆరోగ్య శ్రీ ద్వారా క్యాన్సర్ కు ఉచిత చికిత్స..జగన్ కీలక నిర్ణయం

Announcement in 10 days on PRC: CM Jagan
AP CM YS Jagan Mohan Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా రాష్ట్రంలోనే మూడు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అంతే కాదు ఆరోగ్య శ్రీ ద్వారా క్యాన్సర్ కు ఉచిత చికిత్స అందజేస్తామని తెలిపి క్యాన్సర్ బాధితుల్లో సంతోషం నింపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లేకపోవడంతో బాధితులంతా హైదరాబాద్, బెంగళూరు లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. అలాగే వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుతం ఎన్నో ఆరోగ్య సేవలు అందిస్తున్న రాష్ట్ర సర్కార్.. కరోనా చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చి అందరికి ఆదర్శమయ్యారు. ఇక ఇప్పుడు కాన్సర్ వంటి మహమ్మారి ని కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చి మరోసారి వార్తల్లో నిలిచారు.