కేన్సర్ వ్యాధిపై అవగాహన అవసరం
నేడు కేన్సర్ దినం
కేన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4న ప్రపంచ కేన్సర్ రోజుగా గుర్తిస్తారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఎగెనెస్ట్ కేన్సర్ సంస్థ ప్రతి ఏటా ఫిబ్రవరి 4న కేన్సర్ దినోత్సవంగా జరిపి ప్రజలలోకి కేన్సర్ అవగాహనను తీసుకెళ్లేందుకు కృషి ప్రారంభించింది. ఆ సంస్థల్లో మొత్తం 100 దేశాలు, కేన్సర్ వ్యాధి మీద యుద్ధం చేస్తున్న 350 సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. మీడియా ద్వారా కేన్సర్ వ్యాధి ప్రమాదాన్ని ప్రచారం చేయాలని పాలనా విధానాలలో కేన్సర్ వ్యతిరేక చర్యలు చేపట్టేలా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం కూడా ఆ సంస్థలు చేస్తున్న పని. 2006 నుండి ఫిబ్రవరి 4న కేన్సర్ డేగా జరుపుతూ తగిన చర్యలు చేపట్టాయి. సాధారణంగా మన శరీరంలో కణవిభజనలు ఒక క్రమపద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణసమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణ సమూహాలను ‘కంతి అంటారు.
అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఆంకాలజీ అంటారు. కేన్సర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి. కేన్సర్ మహమ్మారి ఏటా రూ.41,17,000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడింట రెండొం తుల క్యాన్సర్ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవి స్తున్నాయి. అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయం చేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కేన్సర్ అనేది ఏ వయస్సు వారికైనా రావచ్చు.
శరీరంలో నోరు, గొంతు, ఎముకలు, రొమ్ము, చర్మం మున్నగు ఏ భాగానికి అయినా రావచ్చు. శరీరంలో ఏదైనా అవయవానికి కేన్సర్ తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవు. వ్యాధిసోకిన అవయవాన్ని బట్టి దీని నిర్ధారణ పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని రకాల కేన్సర్లను ఒకే విధమైన పరీక్షతో తెలుసుకోవడం సాధ్యంకాదు. కేన్సర్ అంటువ్యాధి కాదు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా తక్కువే. అయితే రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, పాంక్రియాస్ కేన్సర్ను తొలి దశలో గుర్తించకపోతే ఇతర భాగాలకు వ్యాపించి చికిత్సకు సైతం ఏమాత్రం తగ్గుముఖం పట్టవ్ఞ. కాబట్టి దీనిని అవగాహనతో ఎదు ర్కొవాలి. కేన్సర్కు కారణాల్లో ఆధునిక జీవనశైలి ప్రధానమైంది. మద్యం, పొగతాగడం, ఆహార పదార్థాల్లో రంగుల వినియోగం, రసాయనాలు వాడటం,హార్మోన్లు అధికంగా వాడటం,అధికబరువు, కాలుష్యం, క్రిమిసంహారకాలు, చికిత్సలో భాగంగా లేదా ప్రమాదావశాత్తు రేడియేషన్స్కు గురికావడం, తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు, ఇవన్నీ కేన్సర్కు కారకాలు. కొన్నిరకాల కేన్సర్లను రాకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు.
వాటిలో గర్భాశయ ముఖద్వారా కేన్సర్కు ప్రధాన కారణం హెచ్పీవీ వైరస్.కాబట్టి దీనికి వ్యాక్సిన్ వేసుకొని నివారించవచ్చు. తొమ్మిదిఏళ్లు పైబడిన బాలికల నుంచి 40 ఏళ్ల మహిళల వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అలాగే అండాశ యం, గొంతు కేన్సర్ రాకుండా కూడా ఇది అడ్డుకుంటుంది. కేన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కేన్సర్ను తొలి దశలోనే గుర్తించడం,దానికి ఇతర అవయవాలకు విస్తరించే గుణం ఉందా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, థెరపీలు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయి. కేన్సర్ను జయించడం, త్వరగా గుర్తించడంతోపాటు ఆ కణితులు పరిమాణం,దశ, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం. కేన్సర్కు వయసుతో సంబంధం లేదు. అన్ని వయసులవారూ దీని బారినపడే అవకాశాలు మెండు గా ఉంటాయి. కానీ చిన్న పిల్లల్లో వచ్చే కేన్సర్లు చాలా వరకు పూర్తిగా నయం చేయగలిగినవే. అయితే వయస్సు పెరిగే కొద్దీ కేన్సర్ ముప్పు ఎక్కువ
. ఈ సమయంలో వచ్చే కేన్సర్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కేన్సర్ చికిత్సను కూడా వయస్సును బట్టి నిర్ధారిస్తారు. కేన్సర్ కణాలను నిర్వీర్యం చేయ డానికి కీమోథెరపీ, రేడియో థెరపీలతో పాటు ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసే కీహోల్ సర్జరీలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి.సర్జరీ తర్వాత రేడియో, కీమో,హార్మోన్ థెరపీ లాంటివి చేసినా, లేక థెరపీల తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో అయిపోయిందని భావించరాదు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలి. కేన్సర్ కణం శరీరంలో ఎక్కడుందనే విషయం తెలుసుకోవడం కష్టం. ఏ అవయవానికి సోకిందనే అనుమానం ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, యఫ్యెన్ఏ టెస్ట్, బ్లడ్మార్కర్స్, ఎక్స్-రే, సిటీస్కాన్, యంఆర్ఐ, పిఇటిస్కాన్ వంటివి అవసరాన్ని బట్టి చేస్తారు.
అయితే సర్వైకల్ క్యాన్సర్ను పాప్స్మియర్ ద్వారా ముందుగా గుర్తించవచ్చు.ప్రభుత్వ చర్యలలో భాగంగా పొగాకు వాడకంపై యుద్ధం ప్రకటించడం, సిగరెట్ తయారీ కంపెనీలు వ్యాపార ప్రకటనలు ఇవ్వటాన్ని నిషేధించాయి. అదే విధంగా బీడీ కట్టల మీద పుర్రె గుర్తు ముద్రణతో కేన్సర్ భయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లగలిగారు. మత్తుపానీయాల ప్రకటనల మీద నిషేధం తీసుకువచ్చారు.మనదేశంలో నోటికేన్సర్ కేసులుఅధికంగా నమోద వడానికి గుట్కా వాడకమే.భారతదేశంలో 80శాతంమందికేన్సర్ను ముందుగా గుర్తుపట్టలేకపోతున్నారు.కేన్సర్పై అవగాహనపెరగాలి.
నేడు లైఫ్స్టైయిల్ మారింది. పొగాకు సంబంధిత పదార్థాలు వాడటంవల్ల 40 శాతం మందికి కేన్సర్ వస్తున్నదని తెలుస్తున్నది. చికిత్సకు సంబంధించి నిర్ణయాలు మూడు విషయాలపై ఆధార పడి ఉంటాయి. శరీర సాధారణ స్థితి, ఇతర జబ్బులు, కేన్సర్ దశ, రోగి కోరిక, సమ్మతి, తొలిదశలో ఉన్న కేన్సర్లలో 70నుంచి 90 శాతం కేసుల్లో నయం అయ్యే అవకాశం ఉంది. కేన్సర్ చికిత్సలో19వ శతాబ్దం చివరి దశలో కేన్సర్కు శస్త్రచికిత్స ప్రారం భమైంది.అయితే కేన్సర్కు శస్త్రచికిత్స రానురాను వయస్సు పెరిగే కొద్దీ తగ్గిపోతున్నది. రేడియేషన్ చికిత్స,ఎక్స్రేను కనుగొన్న 1895 నుండి జరుపబడుతున్నది.
వృద్ధుల్లో కేన్సర్ జబ్బుకు రేడియేషన్ చికిత్సను ఎక్కువగాఉపయోగిస్తున్నారు. కేన్సర్కు మందులతో చికిత్స 1950 నుండి ప్రారంభమైంది.వృద్ధుల్లో కేన్సర్ చికిత్సకు మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కేన్సర్ కష్టనష్టాల గురించి ప్రజలకు తెలియచేసి అవగాహన కల్పించాలి. కేన్సర్ వ్యాధిని నయం చేయడానికి శస్త్ర చికిత్స,రేడియేషన్, కీమోథెరపీ అవసరం. ఆరోగ్యపు అలవాట్లను, ఆహారపు అలవాట్లను 30 నుంచి 40 ఏళ్ల వయస్సునుంచే ప్రారంభించాలి. తొలి దశలోనే కేన్సరును గుర్తించి చికిత్సపొందాలి.ధూమపానం,గుట్కా, జర్దా కిల్లీలు మానాలి. పండ్లు, కూరగాయలు, పీచుపదార్థం ఎక్కువ గానూ,కొవ్వు తక్కువగానూ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కేన్సర్ బారినుండి శరీరాన్ని రక్షించుకోవాలి.
- రామకిష్టయ్య సంగనభట్ల
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/