కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోడి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ…నువ్వుల మద్దతు ధర క్వింటాల్కు 452 రూపాయలను పెంచామని, మినుములు క్వింటాలుకు 300 రూపాయలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వరి మద్దతు ధరను కూడా పెంచామని తెలిపారు. గతంలో 1,868 రూపాయలుండగా, ఈ ఖరీఫ్ కాలానికి గాను 1,940 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జొన్నలు, ఇతర తృణధాన్యాల కనీస మద్దతు ధరను కూడా పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వరి మద్దతు ధరను కూడా పెంచామని తెలిపారు. గతంలో 1,868 రూపాయలుండగా, ఈ ఖరీఫ్ కాలానికి గాను 1,940 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జొన్నలు, ఇతర తృణధాన్యాల కనీస మద్దతు ధరను కూడా పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/