అబార్షన్ గడువు పై కేంద్రం కీలక నిర్ణయం
అబార్షన్ పరిమితిని 24 వారాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు ఉంది. ఈ కాల పరిమితిని 24 వారాలకు పెంచారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. మహిళలు గర్భాన్ని తొలగించుకునే పరిమితిని 24 వారాలకు పెంచడం ద్వారా వారి పునరుత్పత్తి హక్కులను కాపాడినట్టవుతుందని ఆయన తెలిపారు. మొదటి ఐదు నెలల (20 వారాలు) తర్వాత శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే గర్భిణులు… ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవాలంటే కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని… ఈ నేపథ్యంలో అబార్షన్ కు నాలుగు వారాల గరిష్ట పరిమితిని పెంచడం వారి హక్కులను కాపాడటమేనని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/