భోగాపురం ఎయిర్ పోర్టుకు కేబినెట్ ఆమోదం
జీవీఎంసీ ఎన్నికల్లో 95 స్థానాల్లో గెలిపిస్తే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
విశాఖ: వైఎస్ఆర్సిపి ఎంపి విజయసాయిరెడ్డి ఈరోజు విశాఖలో ఈమీడియాతో మాట్లాడుతూ.. మరికొందరు కీలక నేతలు తమ పార్టీలోకి రాబోతున్నారని తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 98 స్థానాలకు గాను 95 స్థానాల్లో గెలిపిస్తే… నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పురుషోత్తంపట్నం నుంచి విశాఖకు తాగినీటిని అందించే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/