బెంగళూరులో దారుణం : మహిళను అత్యాచారం చేసిన క్యాబ్ డ్రైవర్
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటునప్పటికీ కామాంధులు మాత్రం మారడం లేదు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా బెంగుళూర్ లో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై ఉబెర్ డ్రైవరు అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే..
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవన్ బీమానగర్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. సదరు మహిళ తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ముగించుకొని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతం నుంచి మురుగేశ్ పాళ్యానికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ గమ్యస్థానానికి చేరుకోగానే ఉబెర్ డ్రైవరు కారు లాక్ చేసి, మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం మహిళను కారులో నుంచి బయటకు నెట్టాడు.
అయితే బాధిత మహిళ అరుపులు విన్న క్యాబ్ డ్రైవరు అక్కడినుంచి పారిపోయాడు. అనంతరం బాధిత మహిళ అత్యాచార ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి నుంచి లాక్కున్న సెల్ఫోన్ను పోలీసులకు ఇచ్చింది. సదరు క్యాబ్ డ్రైవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని, అతన్ని ప్రశ్నిస్తున్నామని బెంగళూరు అదనపు పోలీసు కమిషనర్ మురుగన్ చెప్పారు. అయితే, మహిళపై అత్యాచారం చేసినటువంటి ఆరోపణలను క్యాబ్ డ్రైవర్ ఖండిస్తున్నాడు. క్యాబ్ చార్జీ చెల్లింపు విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగిందని, తాను మహిళా ప్రయాణికురాలిని తాకలేదని చెపుతున్నాడు.