సీఏఏపై స్పందించిన రజనీకాంత్‌

ఈ చట్టంతో భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదు

Rajinikanth
Rajinikanth

చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై సినీనటుడు రజనీకాంత్‌ స్పందించారు. ఈ చట్టంతో భారతీయులకు ఎ లాంటి ప్రమాదం లేదని, ఒకవేళ ఈ చట్టంతో ముస్లింలకు ఏదైనా ముప్పు జరిగితే వారి తరఫున పోరాడ మొదటి వ్యక్తిని తానేనని చెప్పారు. భారత్, పాక్ విడిపోయిన అనంతరం భారత్‌లోనే ఉండాలని నిశ్చయించుకున్న కోట్లాది మంది ముస్లింలను దేశం నుంచి పంపిస్తారని ఎలా అనుకుంటున్నారని రజకీకాంత్ ప్రశ్నించారు. ఈ చట్టంతో దేశ పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండవని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అలాగే, అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులను గుర్తించేందుకు ఎన్‌పీఆర్‌ చాలా ముఖ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/