రిలయన్స్ తో టిక్‌టాక్ చర్చలు?

బైట్‌డాన్స్ తో ప్రాథమిక చర్చలు

TickTalk talks with Reliance?!

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ టిక్ టాక్ ను సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నారని, ఇప్పటికే బైట్ డ్యాన్స్ తో ప్రాధమిక చర్చలు సైతం పూర్తయ్యాయని ఓ వార్త వచ్చింది. ఇరు కంపెనీల అధికారుల మధ్య ధర విషయమై చర్చలు సాగుతున్నాయని సమాచారం.ఇండియాలో తమ మొత్తం వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు విక్రయించేందుకు బైట్ డ్యాన్స్ సైతం సుముఖంగానే ఉందని ఈ విషయంలో టిక్ టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయర్ స్వయంగా ఆర్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించారని, దాదాపు నెల రోజుల క్రితమే చర్చలు ప్రారంభమైనా, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ‘టెక్ క్రంచ్’ తన ప్రత్యేక రిపోర్టులో పేర్కొంది.

ఇక టిక్ టాక్ భారత విభాగాన్ని సొంతం చేసుకోనుందన్న వార్తలపై అధికారికంగా స్పందించేందుకు రిలయన్స్ నిరాకరించింది. కాగా, సెప్టెంబర్ 15కు లోపే టిక్ టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మేసుకోవాలని ఆ తరువాత, చైనా మాతృసంస్థతో ఏ విధమైన లావాదేవీలనూ అనుమతించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పిన సంగతి విదితమే. టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ యూఎస్ టిక్ టాక్ బిజినెస్ ను కొనుగోలు చేయాలన్న ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/