రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ అధికారంలోకి రాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా – బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ అధికారంలోకి రాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా అని ప్రకటించారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్లు రాజకీయాలు వదిలేస్తారా అంటూ సవాల్ విసిరారు. నందికొట్కూరు అమ్మవారిశాలలోని వాసవీమాతను దర్శించుకున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి టీడీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకులు ఇక నుంచైనా నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాల, రాబోయే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో మళ్లీ గెలుస్తామని.. డబ్బా మాటలు మాట్లాడేవాళ్లు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ ఛాలెంజ్ చేసారు.

జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. మళ్లీ వైఎస్సార్‌సీపీకి అధికారం ఖాయమన్నారు. ప్రజలకు మంచి చేసినవాళ్లు ఓడిపోయినట్లు చరిత్రలో లేదు.. వచ్చే ఎన్నికల్లో డబ్బులున్నవాళ్లకు-పేదవాళ్లకు జరిగే పోరాటం.. తప్పుడు ప్రచారాలకు-వాస్తవాలకు జరిగే ఎన్నికలని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు నీతికి-అవినీతికి మధ్య జరిగేవని.. ఆ దేవుడి దీవెనలతో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నారు.