ఢీకొన్న బస్సు – ట్రక్కు..ఆరుగురు మృతి

bus-and-truck-collision-at-vadodara-national-highway

వడోదరా: ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ఈప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్‌ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

రాజస్థాన్‌లోని బిల్వారా నుంచి ముంబయి వెళ్తున్న లగ్జరీ బస్సు.. ట్రక్కును ఓవర్ టెక్ చేసే క్రమంలో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే వడోదరాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు