శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా..33 మందికి గాయాలు

ప్రమాద సమయంలో బస్సులో 42 మంది

road accident
road accident

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం సంభవించింది. 42 మంది వలస కూలీలతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 33 మంది గాయపడ్డారు. మందస మండలం బాలిగాం వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాధితులందరూ కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/