బడ్జెట్ లో నాలుగు రంగాలకు అధిక ప్రాధాన్యత
ఈ ఏడాది వృద్ధిరేటు 9.27శాతంగా అంచనా
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కాగా నాలుగవ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారామె. కాగా వచ్చే 25ఏళ్ల కాలానికి ఈ బడ్జెట్ పునాది కావాలన్నారు. ఈ ఏడాది వృద్ధిరేటు 9.27శాతం అంచనా. మేకిన్ ఇండియాతో 60లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. కేంద్ర బడ్జెట్ 2020-23 హైలెట్స్ …వ్యాక్సినేషన్ వల్ల ఎంతో ఉపయోగం చేకూరిందన్నారు. ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఏడాదని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ఫోకస్. ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది..ఆర్థిక అభివృద్ధికి నాలుగు అంశాలకు అత్యంత ప్రాధాన్యత. త్వరలోనే ఎల్ ఐసీ ఐపీవో. బడ్జెట్ లో నాలుగు రంగాలకు అధిక ప్రాధాన్యత.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/