సోమవారానికి వాయిదా పడ్డ లోక్ సభ
న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్పై దాదాపుగా మూడు గంటలపాటు సుదీర్ఘ ఆర్థిక మంత్రి ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో అనేక కీలక ప్రకటనలు చేశారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు, విద్యావిధానాలకు అధిక ప్రాధాన్యం, వ్యవసాయాభివృద్ధి వంటి పలు కీలక ప్రకటనలు చేశారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/