పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం
ఫిరోజ్పూర్: పంజాబ్ సరిహద్దుల్లోని ఫిరోజ్పూర్ ఏరియాలో మరోసారి డ్రోన్ కలకలం చెలరేగింది. ఫిరోజ్పూర్ ఏరియాలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న ఒక డ్రోన్ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు గుర్తించి పట్టుకున్నారు. చైనాలో తయారైన ఈ డ్రోన్.. పాకిస్థాన్ వైపు నుంచి పంజాబ్లోకి ప్రవేశించిందని అధికారులు చెప్పారు. ఈ డ్రోన్ విషయం తెలియగానే బీఎస్ఎఫ్కు చెందిన సీనియర్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. పరిసరాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల దగ్గరుండి సెర్చ్ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/