‘పాక్ సైనిక విభాగాల్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలనుకున్నాం’
అభినందన్ అప్పగింతకు ముందు పరిస్థితిపై భారత వైమానిక మాజీ చీఫ్ ధనోవా
న్యూఢిల్లీ: బాలాకోట్లోని ఉగ్రస్థావరాలపై భారత్ వైమానికి దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ చేసి సైనిక దుస్సాహసం విజయవంతమై ఉంటేగానుక పాక్ సైనికి విభాగాల్ని తుడిచిపెట్టేద్దామనుకున్నామని నాటి వైమానిక దళాధిపతి బి.ఎస్.ధనోవా తెలిపారు. బాలాకోట్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ యుద్ధ విమానాలను వెంబడిస్తూ పొరపాటున ఆ దేశ సైనికులకు చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ను తెచ్చేందుకు అవసరమైన పాక్ సైనిక విభాగాల్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలనుకున్నామని ధనోవా తెలిపారు.
పాక్ చేసిన దుస్సాహసం కనుక విజయవంతమై ఉంటే అది జరిగే ఉండదేని గుర్తు చేశారు. అభినందన్ వర్ధమాన్ను తిరిగి భారత్కు అప్పగించకుంటే యుద్ధం తప్పదన్న పాక్ మంత్రి వ్యాఖ్యలతో ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వా వణికిపోయారన్న వార్తలపై స్పందించిన ధనోవా ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వర్ధమాన్ను తిరిగి భారత్కు అప్పగించడం మినహా పాకిస్థాన్కు మరో మార్గం లేకుండా పోయిందన్నారు. వర్ధమాన్ను బందీగా తీసుకున్న తర్వాత పాకిస్థాన్ దౌత్యపరంగానే కాకుండా, రాజకీయంగానూ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొందన్నారు. భారత్ కనుక యుద్ధానికి సన్నద్ధమైతే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలుసు కాబట్టే పాక్ నేతలకు ముచ్చెమటలు పోసి ఉంటాయని ధనోవా వివరించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/