మందమర్రి టోల్ ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే హల్చల్

మందమర్రి టోల్ ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేసారు.తన వాహనానికే రూట్ క్లియర్ చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకంగా టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు.దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే నేషనల్ హైవే పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేయడంపై ఎమ్మెల్యే చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెపుతున్నారు.

అంబులెన్స్‌లు, ప్రభుత్వ వాహనాలకు రూట్ క్లియర్ చేయకపోవడంతోనే ఎమ్మెల్యే టోల్ సిబ్బందిపై దాడి చేసినట్లు చెపుతున్నారు. కాగా ఈ ఘటన ఫై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.