రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బీఆర్‌ఎస్‌ జెండా పండుగ

బీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో వాడవాడనా బీఆర్‌ఎస్‌ జెండా పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడుతున్నది.

జై తెలంగాణ, జై భారత్‌, జై కేసీఆర్‌ నినాదాలతో పట్టణాలు, పల్లెలు అని తేడాలేకుండా మారుమోగుతున్నాయి. ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించిన తర్వాత పార్టీ కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసే ప్రతినిధుల సభకు చేరుకుంటున్నారు. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు.