నేటి నుంచి బోరిస్‌ జాన్స్‌న్‌ అధికారిక విధులు

కరోనా బారినుండి కోలుకున్న బోరిస్‌ జాన్స్‌న్‌..నేడు వార్ కేబినెట్ సమావేశం

Boris Johnson
Boris Johnson

బ్రిటన్‌: కరోనా వైరస్‌ నుండి కోలుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఏప్రిల్ 12న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 15 రోజుల అనంతరం నిన్న డౌనింగ్ స్ట్రీట్‌లోని తన కార్యాలయానికి చేరుకున్న జాన్సన్ నేటి నుంచి అధికారికంగా విధుల్లో పాల్గొననున్నారు. నేడు ఆయన కరోనా వైరస్ ‘వార్ కేబినెట్’ సమావేశం కానున్నారు. ‘వార్ కేబినెట్’ తో నేడు జరగనున్న సమావేశంలో సామాజిక దూరం నిబంధనలను సడలించాలా? వద్దా? అనే దానిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు ప్రధాని స్థానంలో విధులు నిర్వర్తించిన విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ మాట్లాడుతూ.. ప్రధాని తిరిగి విధులకు సిద్ధమైనట్టు చెప్పారు. కాగా ఈ నెల 5న లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరిన ప్రధాని వారం రోజులపాటు ఆసుపత్రిలోనే గడిపారు. అందులో మూడు రోజులు ఇంటెన్సివ్ కేర్‌లోనే ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/