హుజురాబాద్ ఖాళీ అయిపొయింది

మొన్నటి వరకు హుజురాబాద్ నియోజకవర్గం ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఎటు చూసిన రాజకీయ నేతల సందడి , హడావిడి కనిపిస్తుండేది. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వాయిదా పడడంతో హుజురాబాద్ ఖాళీ అయ్యింది. ఎటు చూసిన ఖాళీ రోడ్లు కనిపిస్తున్నాయి. జనాల సందడి లేకుండా అయిపొయింది. ఉప ఎన్నికల ప్రచారం తో షాప్స్ అన్ని కూడా బిజీ బిజీ గా సాగాయి. ఇక వైన్ షాప్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రచారంలో తిరిగిన కార్య కర్తలకు మందు , భోజనం పెట్టడం తో హోటల్స్ , వైన్ షాప్స్ అన్ని కూడా కిటకిటలాడుతూ కనిపించాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఏ రాజకీయ నేత కూడా హుజురాబాద్ వైపు చూడని పరిస్థితి ఏర్పడింది.

మొన్నటి వరకు హుజురాబాద్ లో పలు ప్రధాన పార్టీల నేతలు ఒకరి కంటే మరొకరికి దిటుగా ప్రచారం కొనసాగించారు. కాని తెలంగాణా రాష్ట్రలో ఇప్పట్లో ఉప ఎన్నికలు లేవని తేలడం తో పార్టీ నాయకులు, కార్యకర్తలు హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడడం లేదట. మరో మూడు నెలల వరకు ఉప ఎన్నిక.. లేదని తేలడం తో హుజూరాబాద్ ను వదిలేశారట నేతలు. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక తో పాటు మరో మూడు పార్లమెంటరీ నియోజక వర్గాల్లోనూ ఉప ఎన్నికలను వాయిదా వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యం లో.. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది.