ప్రధాని బోరిస్కు 8 ఏళ్ల బుడతడి లేఖ
ఈ ఏడాది శాంటా వస్తాడా…మాంటీ
లండన్: క్రిస్మస్ వస్తున్న నేపథ్యంలో ఓ 8 ఏళ్ల బుడతడు యూకే ప్రధాని బోరిస్ జాన్స్న్కు లేఖ రాశారు. కాగా..ఆ బుడతడి పేరు మాంటీ ఈసారి శాంటా వచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించిందా అంటూ సీరియస్గా లేఖ రాశాడు మాంటీ. మీరు చాలా బిజీ అని నాకు తెలుసు. కానీ మీరు, సైంటిస్టులు ఈ అంశంపై కాస్త స్పందిస్తారా అని ఆ లేఖలో మాంటీ అడిగాడు. నేను నార్త్ పోల్కు కాల్ చేశాను. ఫాదర్ క్రిస్మస్ బహుమతులతో సిద్ధంగా ఉన్నాడు. కచ్చితంగా వస్తాడు. అతనితోపాటు రుడాల్ఫ్, అన్ని రెయిన్డీర్లు కూడా అని మాంటీ ఆ లేఖలో చెప్పాడు. ఆ లేఖను తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. బోరిస్ జాన్సన్ లేఖకు సమాధానమిచ్చారు. తనకు ఇలాంటి లేఖలు చాలా వస్తున్నాయని, అధికారులతో కూడా మాట్లాడినట్లు చెప్పారు. ఈసారి కచ్చితంగా ఫాదర్ క్రిస్మస్ బహుమతులను ఇస్తాడని హామీ ఇచ్చారు. తాను చీఫ్ మెడికల్ ఆఫీసర్తోనూ మాట్లాడానని, ఫాదర్ క్రిస్మస్ జాగ్రత్తగా, త్వరగా తన పని పూర్తి చేసి వెళ్లిపోతే నీ ఆరోగ్యానికి, ఆయన ఆరోగ్యానికి కూడా ఎలాంటి సమస్య ఉండదని మాంటీకి జాన్సన్ సమాధానమిచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/