మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృ వియోగం
ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి
Visakhapatnam: పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ (87) ఆదివారం ఉదయం కన్ను మూశారు.
సుమారు గత నెల రోజులుగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు.
ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు.
విజయనగరంలోని స్వర్ఘధామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/