యాదాద్రిలో బూర నర్సయ్య గౌడ్‌ కు చేదు అనుభవం

టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి పార్టీ లో చేరిన బూర నర్సయ్య గౌడ్‌ కు యాదాద్రి లో చేదు అనుభవం ఎదురైంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జై కేసారంలో బూర నర్సయ్య గౌడ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారాన్ని టిఆర్ఎస్ కార్య కర్తలు అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.

ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితి చక్కదిద్దారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి… బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు బూర నర్సయ్య గౌడ్‌. ఇక బూర నర్సయ్య గౌడ్‌ బీజేపీలోకి చేరగానే.. ఆ పార్టీ నుంచి స్వామిగౌడ్‌, దాసోజు టీఆర్‌ఎస్‌ లోకి చేరడం జరిగింది.