కోర్టులో పేలిన బాంబు..న్యాయవాదులకు గాయాలు

పోలీసుల తనిఖీల్లో బయల్పడ్డ మరో మూడు నాటు బాంబులు

lucknow-court
lucknow-court

లఖ్‌నవ్యూ: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించగా ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ముందు జాగ్రత్తగా అక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మరో మూడు నాటు బాంబులు వారికి దొరికాయి. ఇద్దరు న్యాయవాదుల మధ్య వైరమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. న్యాయవాది సంజీవ్ లోధీని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు పాల్పడినట్లు సమాచారం. బాంబు పేలుళ్లకు కొద్ది సేపటిముందే లోధీపై దాడి కూడా జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియాలో పేర్కొంటున్న వివరాల ప్రకారం.. పేలుడు జరిగిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ బాంబు పేలుడు ఘటనపై న్యాయవాది సంజీవ్ లోధీ స్పందిస్తూ.. జితు యాదవ్ అనే న్యాయవాది తనను లక్ష్యం చేసుకుని ఈ దాడి చేశాడని ఆరోపించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/