కాబూల్లోని పాఠశాల వద్ద బాంబు పేలుళ్లు : 30 మంది మృతి
మరో 50 మందికి తీవ్ర గాయాలు
- కాబూల్లోని దష్ట్-ఎ-బార్చి జిల్లాలో దుర్ఘటన
- మృతుల్లో 11-15 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులే
- ఈ ఘటన ను ఖండించిన తాలిబన్లు
- తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి
Kabul: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని ఓ పాఠశాల వద్ద బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడ్డారు . అత్యంత శక్తిమంతమైన ఈ పేలుడులో 30 మందిమృతి చెందారు. వీరిలో 11-15 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. పశ్చిమ కాబూల్లోని దష్ట్-ఎ-బార్చి జిల్లాలోని సయ్యద్ అల్ షాదా పాఠశాల వద్ద జరిగిన ఈ ఘటనపై తాలిబన్లు స్పందిస్తూ , దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెబుతూ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/