బాంబు పేలుళ్లు..ఏడుగురు మృతి
కాబూల్: ఆప్ఘనిస్థాన్ హెల్మాండ్ ప్రావిన్స్లో శనివారం వేర్వేరుచోట్ల సంభవించిన బాంబు పేలుళ్లలో ఏడుగురు దుర్మరణం చెందగా 20 మందికిపైగా గాయపడ్డారు. హెల్మాండ్ ప్రావిన్స్లోని గిరిష్క్ జిల్లాలో ఉదయం రోడ్డువెంట బాంబు పేలి ఐదుగురు మృతి చెందినట్లు ఆ ప్రావిన్స్ గవర్నర్ ఓమర్ జ్వాక్ తెలిపారు. అదేవిధంగా ఈ తెల్లవారుజామున హెరాత్కాందహార్ జాతీయ రహదారిపై జరిగిన పేలుడులో ఇద్దరు మృతిచెందగా 10 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. పేలుళ్లకు బాధ్యతవహిస్తున్నట్లు ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించుకోలేదు. పేలుళ్ల వెనుక తాలిబన్ల హస్తం ఉందని అనుమానిస్తున్నారు.
తాజా బిజినెస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/