గుజరాత్‌లో మునిగిన 15 ప‌డ‌వ‌లు..11మంది గ‌ల్లంతు

గుజరాత్: గుజ‌రాత్ లోని గిర్ సోమ‌నాథ్ తీరంలో అరేబియా స‌ముద్రంలో 15ప‌డ‌వ‌లు మునిగాయి.. దాంతో 11మంది మ‌త్య్స‌కారులు గ‌ల్లంత‌య్యారు. స‌ముద్రంలోని గాలులు , అల‌ల తీవ్ర‌త‌కు ప‌డ‌వ‌లు మునిగాయి. ఈ ఘ‌ట‌న‌లో 15మంది గ‌ల్లంతు అవ్వ‌గా న‌లుగురిని స్థానికులు కాపాడారు. గ‌ల్లంత‌యిన వారికోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో సముద్రంలో అలలు, గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. అందువ‌ల్లే ఈ ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని సూచించింది కూడా

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/