కరోనా ఎఫెక్ట్‌… ఉమ్మితే వెయ్యి జరిమానా

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం ..ఆదేశాలు జారీ చేసిన ముంబయిమునిసిపల్ కార్పొరేషన్

spit-on-roads
spit-on-roads

ముంబయి: కరోనా మహ్మమారి వ్యాప్తి నియంత్రణకు దేశంలో పలు రాష్ట్రలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన బీఎంసీ.. తొలి రోజు ఏకంగా 107 మందిని గుర్తించి వారి నుంచి రూ. 1.07 లక్షల జరిమానా వసూలు చేసింది. వైరస్ నివారణలో ప్రజలు సహకరించాలని బీఎంసీ కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకుండా పరిశుభ్రత పాటించాలని, ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని, 189 సెక్షన్ కింద అరెస్ట్ చేస్తామని బీఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/