తమిళనాడులో పేలిన బాయిలర్.. ఆరుగురు మృతి
17 మందికి తీవ్ర గాయాలు
తమిళనాడు: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కడలూరు జిల్లా నైవేలి పవర్ ప్లాంట్లో ప్రమాదవశాత్తు ఓ బాయిలర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా… మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని సహాయక బృందాలు ఆసుపత్రులకు తరలించాయి. అక్కడ చెలరేగుతోన్న మంటలను అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ పేలుడుకి గల కారణాలపై స్పష్టత రాలేదు. కొన్ని రోజులుగా ఈ బాయిలర్కు సంబంధించిన పనులు జరగడం లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. ప్రస్తుతం బాయిలర్ ఆపరేషన్ ఆపేశారు. ఈ ప్రమాదం పట్ల విచారణ మొదలుపెట్టినట్లు పవర్ ప్లాంట్ అధికారి తెలిపారు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ప్లాంట్లో పేలుడు జరగడం ఇది రెండవసారి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/