కాబూల్లో పేలుడు..10 మంది మృతి
ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు లక్ష్యంగా బాంబు దాడి
కాబూల్: ఈరోజు ఉదయం అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో పేలుడు సంభవించింది. ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ను టార్గెట్ చేస్తూ బాంబు దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో సుమారు 10 మంది మృతిచెందారు. గతంలో అఫ్గాన్ ఇంటెలిజెన్స్ సర్వీసులో పనిచేసిన సలేహ్కు పేలుడు వల్ల స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ఘటన తర్వాత భారీ స్థాయిలో పొగు కమ్ముకున్నది. అఫ్గాన్ అధికారులు, తాలిబన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకున్నది. తాలిబన్ను వ్యతిరేకిస్తున్న వారిలో సలేహ్ ఒకరు. అయితే ఈ దాడికి తాము కారణం కాదంటూ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది. సలేహ్పై జరిగిన బాంబు దాడి ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/